మీరా చోప్రా కేసు ఢిల్లీ చేరనుందట ..కారణం?

  • June 5, 2020 / 07:03 PM IST

మొన్నటికి మొన్న ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినప్పటి నుండీ పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఈమె పై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. నన్ను, నా తల్లిదండ్రులను భూతులు తిడుతున్నారు మీ ఫ్యాన్స్ అని కూడా ఆమె పేర్కొంది. కేవలం మిమ్మల్ని కాకుండా మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పినందుకు మీ అభిమానులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తరువాత గాయని ‘చిన్మయి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని’ సలహా ఇవ్వడంతో… మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

దీని పై పోలీసులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎనిమిది ట్విటర్‌ అకౌంట్ల నుండే మీరా చోప్రాకు అసభ్యకరమైన సందేశాలు వస్తున్నట్టు సైబర్‌ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దాంతో ఐటీ యాక్ట్‌ 67, 509, 506 సెక్షన్ల క్రింద కేసులు ఫైల్ చేసినట్టు కూడా వారు తెలిపారు.అంతేకాకుండా ‘67ఎ’ సెక్షన్‌ను కూడా జత చేశామని వారు చెప్పుకొచ్చారు. మీరా చోప్రా డిల్లీలో ఉంటుంది కాబట్టి ఈ కేసును అక్కడికే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు వారు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా పై పగబట్టి ఇలా అసభ్యకరమైన కామెంట్స్ చెయ్యడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందట.

2006లో మీరా చోప్రా ను ఎన్టీఆర్ నటించే ఓ చిత్రం నుండీ తొలగించారట. ఆ తరువాత మహేష్ బాబు ఫ్యాన్స్ .. ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్ట్ లకు మీరా చోప్రా తన సోషల్ మీడియా ఎకౌంటు నుండీ లైక్ కొట్టిందట. మళ్ళీ ఇన్నాళ్ళకు దొరికిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ఆమె పై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్నట్టు టాక్ నడుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus