ఫ్యామిలీ తో మరింత సమయం గడపనున్న తారక్

  • November 4, 2016 / 06:32 AM IST

జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం విషయంలో ఇంకా ప్రకటన వెలువడలేదు. ఏ దర్శకునితో తారక్ సినిమా ఒకే చేస్తాడో తెలుసుకోవాలని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఇంకా డైరక్టర్ ని సెలక్ట్ చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయి ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించాలంటే సింగిల్, డబుల్ హిట్ లు ఇచ్చిన దర్శకులు సరిపోరని, బిగ్ డైరక్టర్స్ కావాలని తారక్ భావిస్తున్నారు.

అందుకే తన తర్వాతి చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మాస్ డైరక్టర్ వివి వినాయక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, లింగు స్వామి.. లలో ఎవరో ఒకరితో తీసేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించారు. వారందరూ ప్రస్తుతం ప్రాజక్టులతో బిజీగా ఉండడం, నెక్స్ట్ సినిమాలు ఖరారు అయిపోవడంతో తారక్ కోరికకు గండిపడింది. సో.. ఈ సమయంలో యువ దర్శకుల చేతిలో తన సినిమా పెట్టే దైర్యం లేక మరో రెండు నెలల పాటు రెస్ట్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీతో ఎక్కువసమయం గడపనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus