ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలడంట..!

  • July 13, 2019 / 06:16 PM IST

గతంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… ‘రామాయణం’ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు తరువాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో… ఆగిపోయిందని అంతా అనుకున్నారు. అయితే అది నిజం కాదని… ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అల్లు అరవింద్. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా సెట్ అయ్యాడని… మూడు పార్టులుగా తెరకెక్కనున్న రామాయణాన్ని.. 1500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం.

ఇక ఈ ప్రాజెక్ట్ లో రాముడి పాత్రకి ఎవర్ని సెలెక్ట్ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల రాంచరణ్ ను ఈ పాత్ర కోసం అనుకుంటున్నారని వార్తలు వచ్చినా… అతనికి ఈ పాత్ర పై ఆసక్తి లేదని చెప్పేశాడట. దీంతో ఇప్పుడు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ను ఫైనల్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం పై తెగ చర్చ జరిగింది. ఎన్టీఆర్ మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలడంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంలోనే రాముడుగా నటించి మెప్పించాడు. అంతేకాదు యముడిగా ‘యమదొంగ’ చిత్రంలోనూ రావణుడిగా ‘జై లవకుశ’ లోనూ నటించి మెప్పించాడు. తన తాతగారి లానే పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించగలనని ఎన్టీఆర్ ఎప్పుడో ప్రూవ్ చేసాడు. ఎన్టీఆర్ అయితే మంచి ఆప్షనే కానీ.. అల్లు అరవింద్ గ్యాంగ్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోను రాముడి పాత్ర కోసం సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus