లేటైనా లేటెస్ట్ గా వచ్చేందుకు ఎన్టీఆర్ సన్నాహాలు!

  • October 31, 2016 / 06:24 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ కెరీర్ దాదాపు ఒకే సారి మొదలయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ 1 సూపర్ హిట్ అందుకుంది. మలి చిత్రం సింహాద్రి టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది. వీరికలయికలో వచ్చిన మూడో సినిమా యమదొంగ కలెక్షన్లను కొల్లగొట్టింది.

దాంతో తారక్, జక్కన్న కాంబినేషన్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఆ సమయం అతి త్వరలోనే రానుందని సమాచారం. ఇరువురి కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత జతకట్టనున్నట్లు తెలిసింది. రాజమౌళి ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ కోసం కథను ప్రిపేర్ చేయనున్నారు.

అప్పటిలోపున త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేయడానికి తారక్ ఫిక్స్ అయ్యారు. ఇలా ఇద్దరూ రిలాక్స్ గా మంచి కథతో మనముందుకు రాబోతున్నారు. అంటే లేటుగా అయినా లేటెస్ట్ గా రానున్నారన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus