అబ్బాయ్, బాబాయ్ మధ్య గొడవల్లేవ్!

  • September 19, 2017 / 07:39 AM IST

నందమూరి అభిమానుల్లో కొంత చీలిక ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ విడిపోయారు. అందుకు కారణం బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరమే. ఇప్పటి వరకు ఇద్దరూ ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరైన సందర్భాలు లేవు. ఒకరి గురించి మరొకరు ఎప్పుడూ మీడియా ముందు నోరు మెదపలేదు. దీంతో బాలయ్య, తారక్ మధ్య విభేదాలు ఉన్నాయని అనుకున్నారు. అటువంటిది ఏమి లేదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. బాలకృష్ణ డైలాగ్ చెప్పి అనుమానాలను పటాపంచలు చేశారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

బాబాయ్ డైలాగుల్లో బాగా ఇష్టమైన డైలాగ్‌ ఏంటో చెప్పమని యాంకర్ కోరగా… మాట దాట వేయకుండా నరసింహనాయుడు సినిమాలోని ‘ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. ‘ అనే డైలాగ్‌ను తారక్ తనదైన స్టైల్లో చెప్పి ఆకట్టుకున్నారు. చివర్లో  ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..’ అనడానికి బదులు ‘ఒక్కడినే వస్తా.. చెమట పట్టకుండా చంపేస్తా!’ అని చెప్పి తమ మధ్య విభేదాలు లేవని నందమూరి అభిమానులకు సందేశం పంపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నటించిన జై లవకుశ ఈనెల 21 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus