ఓవర్ సీస్ లో అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ అవుతున్న జైలవకుశ!

  • September 19, 2017 / 04:04 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుసగా మూడు హిట్లు అందుకున్న తారక్ జై లవకుశ తో మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్  నటించిన మూవీ ఎల్లుండి గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఆలా ఇలా కాదు.. ఇదివరకు విడుదల కానన్ని స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. ఒక్క హైదరాబాద్ లోనే వంద స్క్రీన్లలో విడుదల కానున్న ఈ సినిమా ఓవర్సీస్ లోను భారీ రిలీజ్ ప్లాన్ చేశారు.

190 లొకేషనల్లో కలిపి సుమారు 500 స్క్రీన్లలో సినిమా జై లవకుశ విడుదలకానుంది. దీంతో  తారక్ జనతా గ్యారేజ్ తో సాధించిన 2 మిలియన్ డాలర్ల  రికార్డును బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం కంటే ఒకరోజు ముందుగా రిలీజ్ చేయడం, ఎక్కువ స్క్రీన్లను లాక్ చేయడం, అదనపు షోలు  వేయడం వంటి పనులు చూస్తుంటే ఈ  సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ లో రికార్డ్ నెలకొల్పడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus