Bandla Ganesh: అపోలోలో జాయిన్ అయిన బండ్ల గణేష్!

  • April 13, 2021 / 12:37 PM IST

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా సోకింది. గతేడాది ఆరంభంలోనే బండ్ల గణేష్ కి కరోనా సోకింది. దీంతో ఆయన హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అందువలన మరోసారి కరోనా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుందనే ఒపీనియన్ సర్వత్రా ఉంది. ‘వకీల్’ సాబ్’ సినిమా ఫంక్షన్ కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుండి బండ్ల గణేష్ ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్నారు.

కానీ కరోనా అయి ఉండదనే ఆలోచనతో పరీక్షలు చేయించుకోలేదు. కానీ ఎంతసేపటికీ జ్వరం తగ్గకపోవడంతో నిన్న రాత్రి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. అపోలోలో బెడ్ లు ఖాళీ లేకపోవడంతో.. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి సహాయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన చాలా మందికి కోవిడ్ సోకుతోంది.

హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు. అలానే యూనిట్ లో చాలా మందికి కరోనా సోకిందని అంటున్నారు. ఈ వారం నుండి కొత్త సినిమాలు రిలీజ్ లు ఉండవ్ కాబట్టి ఇలాంటి ప్రీరిలీజ్ ఈవెంట్ లు కూడా జరగవని తెలుస్తోంది. కాబట్టి కొంతవరకు కరోనాని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus