పరశురామ్ కి విజయ్ ఓకే చెప్తాడా?

  • July 6, 2019 / 07:40 PM IST

విజయ్ దేవరకొండ తో ‘గీత గోవిందం’ చిత్రం తెరకెక్కించి పెద్ద హిట్టు కొట్టాడు పరశురామ్. ఈ చిత్రంతో మొదటి సారి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాడు. అంతేకాదు విజయ్ ను స్టార్ హీరోని చేసింది కూడా ఈ సినిమానే..! ఇంత పెద్ద హిట్టందుకున్నప్పటికీ పరశురామ్ మరో చిత్రాన్ని మొదలు పెట్టలేదు. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో మహేష్ తో ఓ సినిమ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అల్లు అరవింద్ కు పరశురామ్ వినిపించిన కథ నచ్చకపోవడంతో.. వేరే బ్యానర్ లో చేయడానికి ఆయన బయటకి వచ్చేసాడట.

ఇక మహేష్ బాబు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు… దీంతో మళ్ళీ విజయ్ దేవరకొండ దగ్గరకే వెళ్ళే ఆలోచనలో ఉన్నాడట. విజయ్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విజయ్ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ అలాగే క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ‘మళ్ళీ రావా’ ‘జెర్సీ’ చిత్రాల డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఓ సినిమా.. అలాగే విక్రమ్ కె కుమార్ తో సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఓకే చెప్పే అవకాశాలు.. చాలా తక్కువే..! మరి చూడాలి పరశురామ్ ఏం చేస్తాడో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus