Gopala Krishna: వైరల్ అవుతున్న పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

  • April 13, 2023 / 03:19 PM IST

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఒక సందర్భంలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభన్ బాబు హీరోగా నా డైరెక్షన్ లో ఒక మూవీ తెరకెక్కిందని సినిమా షూట్ సమయంలో కోర్టు సీన్ లో రామానాయుడు గారు ట్రాలీ తోసేవారని ఆయన కామెంట్లు చేశారు. రామానాయుడు గారు ఏం డైలాగులు రాశావని మమ్మల్ని మెచ్చుకున్నారని పరుచూరి వెల్లడించారు. సురేశ్ బాబు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేయగా ఆ సినిమా అదే ఫలితాన్ని సొంతం చేసుకుందని ఆయన అన్నారు.

ఆ సినిమా సక్సెస్ సాధించడం వల్ల అశ్వనీదత్, త్రివిక్రమ్ రావు, దేవీ ప్రసాద్ అడ్వాన్స్ లు ఇచ్చి తర్వాత సినిమా వాళ్ల బ్యానర్ లోనే చేయాలని సూచించారని కృష్ణ లేదా శోభన్ బాబు హీరోగా సినిమాలు చేయాలని వాళ్లు అడిగారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరోజు ఆ అడ్వాన్స్ లను తీసుకుని ఉంటే శంకర్ పల్లిలో 100 ఎకరాల భూమి ఉండేదని ఆ సమయంలో ఎకరం 10,000 మాత్రమేనని ఆయన అన్నారు.

అడ్వాన్స్ తీసుకోవాలని మీ అన్నకు చెప్పండని శంకర్ పల్లిలో చెరో 50 ఎకరాలు కొనిస్తానని సురేష్ బాబు చెప్పాడని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. భవిష్యత్తులో ఆ భూమి మీకే పనికొస్తుందని సురేష్ బాబు సలహా ఇచ్చారని ఆయన అన్నారు. కానీ మా అన్నయ్య వద్దని చెప్పాడని గోపాలకృష్ణ తెలిపారు. వాడు డైరెక్టర్ అయితే నేను ఫిడేల్ వాయించుకోవాలా అని అన్నయ్య అన్నాడని ఆయన కామెంట్లు చేశారు.

అన్నయ్యకు ఇష్టం లేనిది నేను (Gopala Krishna) చెయ్యనని చెప్పానని తర్వాత మాత్రం అన్నయ్య చాలా బాధ పడ్డాడని ఆయన చెప్పుకొచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus