పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ముహూర్తం కుదిరింది!

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అభిమానులు ఆశించిన రీతిలో చిత్రం లేదనే వ్యాఖ్యలు వినిపించాయి. అభిమానులను ఖుషీ చేయడానికి పవన్ త్వరలో మరో కొత్త చిత్రం చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘ఖుషి’తో అభిమానులను ఖుషీ చేయించిన దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కొత్త చిత్రం చేస్తున్నాడనే వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. నెలాఖరున ఈ చిత్ర ప్రారంభోత్సవం జరపడానికి ముహూర్తం నిర్ణయించారని తాజా సమాచారం. ఏప్రిల్ 29న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన అజిత్ ‘వెదాలమ్’ రీమేక్ ఈ చిత్రమట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారట. పవన్ ‘ఖుషి’, ‘బంగారం’ చిత్రాలను నిర్మించిన ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరకర్త. ఇటీవల ముంబైలో సంగీత చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు ఎస్.జె.సూర్య, అనూప్ సంగీత చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఈ ఏడాదిలోనే చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పంగా తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus