అభిమానులకు కొత్త సంవత్సర కానుక ఇవ్వనున్న పవన్ కళ్యాణ్!

  • December 20, 2017 / 01:59 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “అజ్ఞాతవాసి”. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచి క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిన్న ఆడియో వేడుక వైభవంగా జరిగింది. సినిమాలో పాటలు ఇవేనంటూ ఐదు పాటలు రిలీజ్ చేశారు. అయితే మరో పాట ఉందంట. దానిని స్వయంగా పవన్ కళ్యాణ్ పాడారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పాడిన కాటమరాయుడా.. పాట సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు అదే తీరుగా ఇందులోనూ ఓ జానపద పాటను తనదైన శైలిలో ఆలపించినట్లు చిత్ర యూనిట్ ఈరోజు వెల్లడించింది. ఆ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరి ఈ పాట ఎంత హిట్ అవుతుందో చూడాలి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో ఖుష్బూ  కీలక పాత్రలో కనిపించనున్నారు. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న అజ్ఞాతవాసి థియటర్లోకి జనవరి 10 న రానున్నాడు. రికార్డులను బద్దలు కొట్టనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus