Pawan Kalyan: నెట్టింట్లో సందడి చేస్తున్న మల్టీస్టారర్ స్కెచ్.. నిజంగా అద్భుతమే..!

  • April 26, 2021 / 02:28 PM IST

మొన్నామధ్య ‘అరవింద సమేత’ సినిమా లాంచింగ్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అప్పుడు ఎన్టీఆర్, పవన్ లు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అటు తరువాత ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆ ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా లాంచింగ్ కు ప్రభాస్,చరణ్, ఎన్టీఆర్ ,రానా వంటి వారు సందడి చేశారు. అలాగే రాజమౌళి కొడుకు పెళ్ళికి కూడా ఆ హీరోలు హాజరయ్యారు.

ఈ మధ్య కాలంలో ప్రభాస్, మహేష్,చరణ్ విజయ్ దేవరకొండ, రామ్ లు దిగిన ఓ ఫోటో అయితే భారీగా వైరల్ అయ్యింది. ఇదే అద్భుతం అనుకుంటే.. ఇప్పుడు దానిని మించి ఓ ఫోటో కాదు కాదు ఓ ఊహా చిత్రం వైరల్ అవుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. అందరి స్టార్ హీరోలు కలిసి టీ త్రాగడానికి వెళ్లి అక్కడ అందరూ సరదాగా గడుపుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఈ ఫోటోని పవన్ కళ్యాణ్ షేర్ చెయ్యడం విశేషం. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా క‌లిసి సరదాగా టి, కాఫీ లు తాగ‌డానికి ఓ కాఫీషాప్‌ కు వెళ్తే ఎలావుంటుంది? అనే థీమ్ తో హ‌ర్ష అనే ఆర్టిస్టు ఓ స్కెచ్ గీశాడు.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున, రాంచరణ్ లు ఈ స్కెచ్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు.దీనిని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మిగిలిన హీరోలు కూడా ఈ స్కెచ్ ను షేర్ చేస్తుండడంతో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus