అన్నా లెజ్ నోవా తో కలిసి బోస్టన్ వెళ్లిన పవన్ కళ్యాణ్

  • February 9, 2017 / 07:48 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆయనకు తీరిక దొరకడం లేదు. అలాంటిది ఆయనకు బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఇండియా కాన్ఫెరెన్స్ 2017లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానం అందింది. యువతకు నాలుగు మంచి మాటలు చెప్పడానికి తన పనులన్నింటిని పక్కన పెట్టి బయలుదేరారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. దొరికిన కొంత సమయాన్ని విదేశాల్లో భార్యతో ఏకాంతంగా గడపడానికి, ఈ టూర్ కి తన భార్య  అన్నా లెజ్నోవా కూడా తీసుకెళ్లారు. ఆమెకు ఇది రెఫ్రెషింగ్ గా ఉంటుందని భావించారు.

వీరిద్దరూ బోస్టన్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విహరిస్తోంది. అరుదుగా మీడియా కంటికి చిక్కే ఈ జంటను చూసి అభిమానులు ఆనంద పడుతున్నారు. ఇండియా కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న తర్వాత పవన్, అన్నా లెజ్నోవాతో కలిసి రష్యాలోని అత్తారింటికి వెళ్లి, అక్కడ రెండు రోజులు గడిపి వస్తారని సమాచారం. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత  కాటమరాయుడు ఆఖరి షెడ్యూల్ లో పవర్ స్టార్ పాల్గొననున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus