ముగ్గురు హీరోలకు నో చెప్పిన పాయల్ రాజ్ పుత్

  • August 22, 2018 / 01:31 PM IST

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీ గత నెల 12 న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12.45 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కారణమని సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఆమె నటించకుంటే సినిమానే లేదని ప్రశంసలు గుప్పించారు. ఆమె అందం, అభినయంతో యువత, మాస్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రప్పించిందని అభినందించారు. ఈ అభినందనలే దర్శకనిర్మాతల పట్ల తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఆర్ఎక్స్ 100 విజయం, అభినందనలు పాయల్ రాజ్ పుత్ కి పొగరు వచ్చేలా చేసిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అందుకే ఆమె స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకుంటోందని విమర్శిస్తున్నారు.

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో పాయల్ తో ఓ ఐటమ్ సాంగ్ చేయించాలని చిత్ర బృందం సంప్రదిస్తే నో చెప్పిందంట. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సినిమాలో కూడా నటించమని కోరితే ఆ సినిమాలో కూడా నటించనని తెగేసి చెప్పిందంట. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాని సైతం పాయల్ పక్కన పెట్టినట్టు తెలిసింది. అందుకే ఆమెపై తెలుగు చిత్ర నిర్మాతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పాయల్ రాజ్ పుత్ మంచి కథ కోసం, అందులో మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్టు ఆమె వ్యక్తిగత మేనేజర్ వెల్లడించారు. ఆమెకి ఎటువంటి పొగరు లేదని సమర్ధించుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus