Guntur Kaaram: ప్రశాంత్ కారణంగానే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఆగిపోయిందా?

  • January 8, 2024 / 09:56 AM IST

మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూసఫ్ గూడా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని ముందుగా భావించారు కానీ పోలీస్ అధికారులు మాత్రం ఇక్కడ ఈ వేడుకను నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు.

నిజానికి ఈ వేడుక నిన్న సాయంత్రమే జరగాల్సి ఉంది ఈ సినిమా మేకర్స్ చివరి క్షణాల వరకు పర్మిషన్ కోసం ఎదురుచూసినప్పటికీ పోలీసులు మాత్రం ఈ సినిమా వేడుకను జరపడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడంతో మరో ప్రాంతంలో ఈ సినిమా వేడుకను జనవరి 9వ తేదీ నిర్వహించాలని మేకర్స్ భావించారు.

ఇదిలా ఉండదా తాజాగా ఈ వేడుకకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు ఈ వేడుకకు పరిమిషన్ ఇవ్వకపోవడానికి కారణం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కారణమంటూ ఒక వార్తను వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన పల్లవి ప్రశాంత్ రోడ్డుపైకి రావడంతో ఎంత రచ్చ జరిగిందో మనకు తెలిసిందే. అభిమానులు పెద్ద ఎత్తున ప్రభుత్వ అలాగే ప్రవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు.

ఇలా బిగ్ బాస్ విన్నర్ కారణంగానే ఇలాంటి నష్టం జరిగితే ఇంక మహేష్ బాబు లాంటి హీరోలు బయటకు వస్తే ఎంత నష్టం జరుగుతుందోనని పోలీసులు భావించారని అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మేకర్స్ మాత్రమే ఈ కార్యక్రమాన్ని మరొకచోట చేయటానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus