అప్పుడే రకుల్ ని బీట్ చేసేసిన పూజా హెగ్డే

  • September 25, 2019 / 04:56 PM IST

సాధారణంగా ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకొన్నామంటే హీరో అయినా హీరోయిన్ అయినా ప్రారంభోత్సవం నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శితమయ్యే మొదటివారం వరకూ షూటింగ్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, థియేటర్ విజిట్స్ అన్నిట్లో భాగస్వాములవుతాం అని అగ్రిమెంట్ చేసినట్లు. అయితే.. ఈమధ్యకాలంలో హీరోలు పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం షూటింగ్ కి సపోర్ట్ చేస్తే సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు.

ఈ పద్ధతిని మొదలెట్టింది నయనతార. సినిమా ప్రమోషన్స్ కి రాను అని అగ్రిమెంట్ టైమ్ లోనే రాయించుకొనేది. ఇప్పుడు కొత్త హీరోయిన్లు కూడా ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారు, ఆ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పూజా హెగ్డే పేరు. అమ్మడు సినిమాలో నటించినందుకు తీసుకొనే రెమ్యూనరేషన్ కాకుండా సపరేట్ గా ప్రమోషన్స్ కోసం కూడా భారీ మొత్తంలో చార్జ్ చేస్తుందట. నిన్నమొన్నటివరకూ ఒకటిన్నర కోటి తీసుకొన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏకంగా రెండు కోట్లు చార్జ్ చేస్తోంది. ఇదివరకు తెలుగులో రకుల్ మాత్రమే ఈస్థాయి రెమ్యూనరేషన్ అందుకొంది. ఇప్పుడు పూజా ఆమెను బీట్ చేసి ఆమెకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తోంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus