మహేష్ నిర్మాత పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని..!

  • June 24, 2019 / 07:10 PM IST

ప్రముఖ రచయిత, నటుడు అయిన పోసాని కృష్ణమురళి తాజాగా మహేష్ బాబు ‘మహర్షి’ నిర్మాత పై షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల పోసానికి సర్జరీ జరగడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయినప్పటికీ ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు పోసాని. ఈ ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించాడు.

‘జగన్ కి మద్దతు తెలపడం వలన సినిమా ఇండస్ట్రీలో మీరు ఒంటరి కాలేదా..? అనే ప్రశ్నకు పోసాని బదులిస్తూ ..”ఎన్నికలు దగ్గరకు రాగానే ఇండస్ట్రీ వాళ్ళకు కోపం వచ్చింది. దీంతో నాకు అవకాశాలు కూడా తగ్గాయి. నిజానికి వేషాలు రాకుండా చేసారు. నా కంటే వ్యక్తిగత అభిమానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తిట్టాను, చంద్రబాబుని విమర్శిస్తున్నాననే కారణంతో నాకు అవకాశాలు రాకుండా చేశారు. లిస్ట్ లో తన పేరుని కూడా దగ్గరుండి తీయించేసారు. అలా చేసిన వ్యక్తి అశ్వనీదత్” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న వారిలో అశ్వనీదత్ కూడా ఒకరు. ఇటీవల మహేష్ తో ‘మహర్షి’ వంటి భారీ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించారాయన. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో పోసాని కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus