జేమ్స్ బాండ్ గా ప్రభాస్

  • September 3, 2016 / 11:18 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత “రన్ రాజా రన్” ఫెమ్ సుజీత్ తో సినిమా చేయనున్నారు. యువీ క్రియేషన్స్ వారు 80 కోట్లతో నిర్మించనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో డార్లింగ్ పోషించే పాత్ర గురించి బయటికి వచ్చింది. సాహసాలు చేసి, మోసగాళ్లకు ఎదురెళ్లి వారి పని పట్టే  జేమ్స్ బ్యాండ్ తరహా క్యారక్టర్ లో ప్రభాస్ కనిపించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలోని ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ ను దుబాయిలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అక్కడ ఉండే సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచేలా సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అత్యంత ఖరీదైన కార్లను బుక్ చేశారు. ఆ కార్లలో ప్రభాస్ ఒళ్లుగగుర్పొడిచే విన్యాసాలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో అమీ జాక్సన్ మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ మరికొంతమంది బ్యూటీస్ తో డార్లింగ్ రొమాన్స్ చేస్తారని చిత్ర బృందం వెల్లడించింది. ప్రభాస్ కి మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే యాక్షన్ తో రొమాన్స్ కి కూడా ప్రయారిటీ ఇచ్చినట్లు తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయాలని  నిర్మాతలు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus