విషాదాంతంగా ప్రభాస్ ప్రేమకథ!

  • August 7, 2018 / 10:35 AM IST

తెలుగుసినీ చరిత్రలో విజయవంతమైన ప్రేమ కథలు మాత్రమే కాదు.. విఫలమయిన ప్రేమకథలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి ప్రభాస్ విఫలమయిన ప్రేమకథలో నటిస్తే.. అతని ప్రేమకథ బాధతో ముగిసిపోతే.. అటువంటి ఆలోచనే గుండెని గట్టిగా పిండేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది కదూ.. మరి వెండితెరపై చూస్తే కన్నీరు ఆగదు. అందుకే అటువంటి కథనే రాధాకృష్ణ ప్రభాస్ రాసుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో  ప్రభాస్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటించనుంది.

ఇది 1970 నాటి కాలంలో కథ సాగనుంది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ సెట్స్ డిజైన్స్ చేస్తున్నారు. దీనికి 2 కోట్ల దాకా ఖర్చు చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు. గతంలో ప్రభాస్ విషాదాంతంగా చక్రం మూవీ చేశారు. అది హిట్ కాలేదు. ఈ సారి మాత్రం అది రిపీట్ కాకుండా ఉండాలని కథని పక్కాగా రాసుకున్నట్టు సమాచారం. కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ లు కలిసి నిర్మించనున్న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus