సుజీత్ కి జాగ్రత్తలు చెప్పిన ప్రభాస్

  • May 11, 2017 / 12:18 PM IST

రన్ రాజా రన్ సినిమాతో సుజీత్ దర్శకుడిగా పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ మూవీ హిట్ కావడం, అతను చెప్పిన లైన్ నచ్చడంతో ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్ ఒకే చెప్పినప్పుడు.. ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు. సాహో ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కించాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టుగా ఎంత డబ్బులు ఖర్చుపెట్టనికైనా నిర్మాతలు వంశీ, ప్రమోద్ సిద్ధంగా ఉన్నారు. అయితే సాహో సినిమా గురించి సుజీత్ ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. అంచనాలకు తగినట్లు ఏ విధంగా సినిమాని తెరకెక్కించాలని ఆలోచనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట. ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్ డైరక్టర్ కి కొన్ని జాగ్రత్తలు చెప్పినట్లు సమాచారం. వాటిలో ప్రధానమైనది స్క్రిప్ట్.

రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే ముందు పక్కాగా స్క్రిప్ట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ జేసుకోమని సూచించారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చెప్పకుంటున్నారు. అంతేకాదు తన ఇమేజ్ ని, స్టార్ హోదాని దృష్టిలో పెట్టుకొని అసలు టెన్ష‌న్ ప‌డొద్ద‌ని, సినిమా తీయ‌డంలో పూర్తి స్వేచ్ఛ‌గా ఉండాల‌ని సుజీత్‌కు చెప్పి అమెరికా టూర్ కి వెళ్లినట్లు తెలిసింది. దీంతో రిలాక్స్ అయిన సుజీత్ దైర్యంగా షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ అమెరికా ట్రిప్ నుంచి రాగానే సాహో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus