‘సాహో’ బడ్జెట్ పై ప్రభాస్ క్లారిటీ !

  • August 13, 2019 / 05:19 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం పై రోజు రోజుకి ఆసక్తిని పెంచుతున్నారు యూనిట్ సభ్యులు. ఆగష్టు 30 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేశారు. ‘సాహో’ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్.. ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఇక ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రానికి ఎంత ఖర్చయ్యింది అనేది ‘సాహో’ టీం ఎక్కడా చెప్పలేదు. ఏదో 250 నుండీ 300 కోట్లవరకూ అయ్యిందని అంతా అనుకున్నారు. తాజాగా ఈ విషయం పై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ‘సాహో’ చిత్రానికి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ అయ్యిందట. వినడానికే చాలా షాకింగా ఉంది కదూ. ఓ కొత్త డైరెక్టర్ ను నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టారు అనేది ఇప్పటికి అర్ధం కానీ ప్రశ్న. అయితే సుజీత్ అంచనాలని మించే ‘సాహో’ ని తెరకెక్కించాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే ఏకంగా 90 కోట్లు ఖర్చు చేశారట. హిట్ టాక్ వస్తే మంచి వసూళ్లు రావడం ఖాయం అందులో డౌటే లేదు. కానీ ప్లాప్ టాక్ వచ్చినా తీవ్ర నష్టాలు వస్తాయనడంలో కూడా సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus