Prabhas: ప్రభాస్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ప్రభాస్ షెడ్యూల్ ఇదేనా?

  • June 6, 2023 / 12:12 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఆదిపురుష్ మూవీ నైజాం హక్కులు ఏకంగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ హక్కులను ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసింది.

ఈరోజు తిరుపతిలో ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పంచెకట్టులో ప్రభాస్ శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం పలకడంతో పాటు దర్శన ఏర్పాట్లను చేయడం గమనార్హం. దర్శనం తర్వాత ప్రభాస్ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.

ఆలయ అధికారులు (Prabhas) ప్రభాస్ ను పట్టు వస్త్రాలతో సత్కరించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రభాస్ ను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత ప్రభాస్ తారకరామ స్టేడియంలో జరగనున్న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఈవెంట్ తో ఆదిపురుష్ మూవీపై అంచనాలు మరింత పెరుగుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ లుక్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus