ఏడాదికి ఒక ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందా?

  • September 6, 2020 / 11:58 AM IST

ఒక సినిమా కంప్లీట్ చేసిన తరవాత మరో సినిమా స్టార్ట్ చేయడం ప్రభాస్‌కి అలవాటు. ‘సాహో’ టైమ్‌లో దాన్ని బ్రేక్ చెయ్యాలని చూశాడు. కానీ, కుదరలేదు. ‘సాహో’తో పాటు ‘రాధే శ్యామ్’ షూటింగ్ సైమల్‌టేనియస్‌గా స్టార్ట్ చేసినా ప్లాన్ చేసినట్టు షూట్ చెయ్యలేదు. ఇకనుండి అలా జరగకుండా చూసుకోవాలని పర్‌ఫెక్ట్‌గా షెడ్యూళ్ళు ప్లాన్ చేస్తున్నాడట. ఈసారి రెండు పడవల మీద ప్రయాణం చేసి, 2022లో రెండు సినిమాలు రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నాడట.

ప్రజెంట్ ప్రభాస్ ముందు మూడు సినిమాలు ఉన్నాయి. ‘రాధే శ్యామ్’ షూటింగ్ కొంత చేశాడు. ముందు దాన్ని కంప్లీట్ చెయ్యాలి. తరవాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఫ్యూచరిస్టిక్ సైంటిఫిక్ థ్రిల్లర్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో రామాయణం ఆధారంగా మైథలాజికల్ సోషియో ఫాంటసీ ‘ఆది పురుష్’ కంప్లీట్ చెయ్యాలి. కరోనా కథాకమామీషు ముగిసిన తరవాత బ్రేక్ తీసుకోకుండా వన్ బై వన్ కంటిన్యూగా షూటింగ్ చెయ్యాలని అనుకుంటున్నాడట.

‘ఆది పురుష్’ టీమ్ నుండి వన్ బై వన్ అప్‌డేట్స్ వస్తుండటంతో నాగ్ అశ్విన్ సినిమా లేట్ అవుతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ కంప్లీట్ చేశాక, ఓం రౌత్ సినిమా స్టార్ట్ చేస్తారట. 2021 జూలై లేదా ఆగస్టు నుండి నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ మొదలు అవుతుందట. నెక్స్ట్ ఇయర్ ‘రాధే శ్యామ్’, ఆ నెక్స్ట్ ఇయర్ ‘ఆది పురుష్’ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. నాగ్ అశ్విన్ సినిమా 2022లో రిలీజ్ చేయడం వీలు కాకపోతే 2023కి షిఫ్ట్ అవుతుందట.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus