ప్రభాస్ రెబలిజం మొదలెట్టాడు..!

  • December 25, 2020 / 08:42 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెబలిజం స్టార్ట్ అయ్యిందా అంటే నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు మేటర్ ఏంటంటే., ప్రభాస్ వరుసగా పాన్ ఇండియన్ మూవీస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో భారీ ప్రాజెక్ట్, అలాగే ఆదిపురుష్ సినిమా, ఇంకా సలార్ సినిమాలకి శ్రీకారం చుట్టేశాడు. ముగ్గురూ స్టార్ డైరెక్టర్సే, మూడు పాన్ ఇండియన్ సినిమాలే. ఈ సినిమాలు ఇప్పుడు చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు మనోడు. అయితే, ముందు ఏ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అనేది ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తోంది.

బాలీవుడ్‌ దర్శకుడు ఔంరౌత్‌ డైరక్షన్‌ లో తెరకెక్కనున్నసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి నుంచి ప్రారంభం కానుంది. అలాగే కెజిఎఫ్‌ డైరక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోతున్న సినిమా కూడా జనవరి 18నుంచి సెట్స్‌ పైకి రానున్నట్లుగా టాక్ వినపిస్తోంది. వీటితో పాటుగానే నాగ్ అశ్విన్ సినిమాని కూాడ స్టార్ట్ చేసేస్తాడట.

అయితే, అన్నింటికంటే ముందు ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ కానున్నాడు. మరోవైపు ఆదిపురుష్‌ లో వీఎఫ్‌ ఎక్స్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఈ వర్క్‌ ని ముందుగా కంప్లీంట్‌ చేసుకొని ఆ తర్వాత ప్రభాస్‌ పై షూట్‌ ని మొదలుపెడతారట. అలాగే నాగ్ అశ్విన్ సినిమాలో కూడా విఫెక్స్ వర్క్ చాలా ఉంటుందని అందుకే అది కూడా కాస్త లేట్ గా స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇంకా ఈ సినిమాల్లో హీరోయిన్లు ఫైనల్‌ కాలేదు. పలువురి బాలీవుడ్‌ భామల పేర్లు వినిపిస్తున్నా ఇంకా చిత్రయూనిట్‌ మంచీ మాత్రం అఫీషియల్‌ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు.

ఇక ఈ మూడు సినిమాలు కూడా బాలీవుడ్ ని షేక్ చేసే సినిమాలే అవుతాయని లెక్కలు వేస్తున్నారు. ఈ మూడు విభిన్నమైన కాన్సెప్ట్స్ ఉన్న స్టోరీలే. వీటితో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వక తప్పదు అనే జోస్యం చెప్తున్నారు సినీ పండితులు. అదీ మేటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus