ఒళ్లు గగుర్పొడిచే ఛేజింగ్ సీన్ చేస్తున్న ప్రభాస్

  • April 21, 2018 / 12:37 PM IST

సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో మొదలయింది. నేటి నుంచి అత్యంత సాహసమైన కారు ఛేజింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం యుఎస్ ఎ నుంచి కొన్ని కార్లను తెప్పించినట్టు సమాచారం. ప్రభాస్, నీల్ నితిన్ ముకేష్, తదితరులపై చిత్రీకరించే ఈ కార్ల ఛేజింగ్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విన్యాసాలు సహజంగా రావాలని ఎటువంటి రోప్స్ లేకుండా ప్రభాస్ చేస్తున్నట్లు తెలిసింది. సినిమాకోసం ఎంత రిస్క్ అయినా ప్రభాస్ చేయడాన్నీ చూసి చిత్రబృందం ఆశ్చర్యపోతోంది.

దుబాయ్ లోని అత్యంత రద్దీ ప్రాంతాలుగా పేరుగాంచిన బుర్జ్ ఖలీఫా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇతిహాద్ టవర్(అబుదాబి) ప్రాంతాల్లో షూట్ చేయనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ 20 నిముషాలపాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నాయి. ఈ సన్నివేశాన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు. దాదాపు 40 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అనంతరం ప్రభాస్ హైదరాబాద్ కి రానున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus