ఖాళీగా ఎందుకని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారట

  • March 31, 2020 / 12:57 PM IST

ప్రభాస్ ప్రస్తుతం ఓ పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి జాన్ అనే వర్కింగ్ వాడుకలో ఉంది. ఈ చిత్ర షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. ఐతే ప్రభాస్ సాహో సినిమా విడుదల తరువాత నాలుగు నెలల విరామం తీసుకున్నారు. దీనితో షూటింగ్ అనుకున్న ప్రకారం పూర్తి కాలేదు. ఐతే సాహో విడుదలకు ముందే జాన్ 20 నుండి 30 శాతం షూటింగ్ పూర్తి చేశారు.

ఇక గత రెండు నెలలుగా నిరవధికంగా ఈ చిత్ర జరుగుతుంది. ఇటీవలే జార్జియా దేశంలో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పూజ హెగ్డే మరియు ప్రభాస్ పై కొన్ని సాంగ్స్ చిత్రీకరించారని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ వెంటనే మొదలు కావాల్సిఉండగా కరోనా బంద్ కారణంగా వాయిదా వేశారు. దీనితో ఈ చిత్ర విడుదల 2021కి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా ఈ మూవీని ఎలాగైనా 2020లో విడుదల చేయాలని నిశ్చయించుకున్న యూనిట్ ఈ బ్రేక్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారట. త్వరలో జాన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తికాగా కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందట. పూర్తయిన చిత్రీకరణ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారని టాక్. యూవీ క్రియేషన్స్ భారీగా తెరకెక్కిస్తుండగా తెలుగుతో పాటు హిందీ మరియు తమిళ భాషలలో విడుదల కానుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus