Pranitha: ఆ పనితో వాళ్ల నోరు మూయించిన హీరోయిన్ ప్రణీత.. ఏం జరిగిందంటే?

  • July 18, 2023 / 06:42 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ప్రణీత ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రణీత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న ప్రణీతకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా ప్రణీత చేసిన ఒక పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ప్రణీత టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టారు.

అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ బ్యూటీ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. తాజాగా భర్తకు పాద పూజ చేయడం ద్వారా ప్రణీత వార్తల్లో నిలిచారు. కర్ణాటక రాష్ట్రంలో భీమన అమవాస్య రోజున భార్య భర్త పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. గతేడాది ఈ ఆచారాన్ని పాటిస్తూ భర్తకు పూజలు చేసిన ప్రణీత ఈ ఏడాది కూడా ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

గతేడాది ఫెమినిస్ట్ లు ప్రణీతపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా ఆ విమర్శలను ఏ మాత్రం లెక్క చేయకుండా పాద పూజ చేసి భర్తపై ప్రేమను ప్రణీత సుభాష్ చాటుకున్నారు. తనపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ప్రణీత ముందడుగులు వేస్తున్నారు. ఆచారాలను, సనాతన ధర్మాలను నేను పాటిస్తానని ఆమె వెల్లడిస్తున్నారు.

ప్రణీత (Pranitha) తెలుగు సినిమాలతో మళ్లీ బిజీ అయితే బాగుంటుందని ప్రణీత కామెంట్లు చేస్తున్నారు. ప్రణీతను అభిమానులు ప్రేమగా బాపు బొమ్మ అని పిలుస్తున్నారు. ప్రణీత తెలుగులో రీఎంట్రీ ఇస్తే కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రణీత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus