రమ్యకృష్ణ పాత్ర పై కన్నేసిన ప్రియమణి..!

  • January 5, 2020 / 05:29 PM IST

‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన ప్రియమణి.. ఆ తరువాత ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రంతో మొదటి హిట్ ను అందుకుంది. ఆ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇక అతి తక్కువ టైంలోనే రాజమౌళి డైరెక్షన్లో హీరోయిన్ గా చేసే అవకాశం కొట్టేసింది. ఎన్టీఆర్, నాగార్జున, నితిన్, గోపీచంద్, సూర్య వంటి క్రేజీ హీరోల సినిమాల్లో నటించిన ప్రియమణి.. ఆ తరువాత తమిళంలో కూడా అవకాశాలు దక్కించుకుని.. ఏకంగా నేషనల్ అవార్డు కూడా కొట్టేసింది.

అయితే పెళ్ళైన తరువాత.. సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోన్న ప్రియమణి.. టీవీ షోలతో మాత్రం ప్రేక్షకులకి దగ్గరగానే ఉంటూ వస్తోంది. అంతేకాదు ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే ‘నటిగా పరిచయమై 17 ఏళ్ళయినప్పటికీ తన కోరిక మాత్రం తీరలేదంటుంది ఈ బ్యూటీ. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడుతూ.. “నా డ్రీమ్ రోల్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు. ‘పడయప్పా’ సినిమాలో రమ్యకృష్ణ గారు చేసిన నీలాంబరి పాత్రలా నాకు ఓ నెగెటివ్ రోల్ లో నటించాలనుంది. నా వాయిస్ నెగెటివ్ పాత్రలకు బాగుంటుందని చాలా మంది చెబుతుంటారు. కాబట్టి అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus