Priyamani: తన భర్త గురించి ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

  • June 6, 2023 / 01:39 AM IST

‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత జగపతి బాబుతో చేసిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ వెంటనే ఈమెకు రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘యమదొంగ’ చిత్రంలో ఛాన్స్ దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ళ వరకు ఈమె ప్రయాణం ఇక్కడ బాగానే జరిగింది. కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చాక ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో ఈమె (Priyamani) కన్నడ .. మలయాళ సినిమాలతో బిజీ అయ్యింది. అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో ఈమె.. ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముస్తఫా రాజ్ బిజినెస్మెన్ కాబట్టి.. వ్యాపార రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. అయితే నిన్న అంటే జూన్ 4 న ప్రియమణి పుట్టినరోజు. ఇది ఆమెకు 39 వ పుట్టినరోజు. దీంతో భర్తను తలుచుకుంటూ ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో … ‘నా జీవితంలో మరో కొత్త సంవత్సరం ప్రవేశించింది.

ఓ రకంగా నేను పెద్దగా అయ్యాను.. ఇంకొంచెం తెలివైన దాన్ని అయ్యాను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో చేసే ప్రతి పనిని మరింత మెచ్యూర్డ్ గా అలోచించి చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ముస్తాఫ రాజ్. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్” అంటూ పేర్కొంది ప్రియమణి. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ‘మీకు భర్త ఉన్నా లేనట్లే’ అంటూ ఆమెను రెచ్చగొట్టే కామెంట్స్ పెట్టారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus