చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబుకు ఇంకా గెలుపు వినపడలేదా..?

  • May 28, 2019 / 06:26 PM IST

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘాన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే జగన్ సీఎం కాబోతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే జగన్ విజయాన్ని సినీ పరిశ్రమ తట్టుకోలేకపోతుందని అంటున్నారు 30 ఇయర్స్ పృధ్వీ..! చంద్రబాబు గెలిస్తే బొకేలు ఇవ్వడానికి రెడీగా ఉండే సినీ ప్రముఖులు… జగన్ గెలిస్తే కనీసం ట్వీట్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు.

పృధ్వీ మాట్లాడుతూ… “చంద్రబాబు ముఖ్యమంత్రయిన రోజుల్లో పొద్దున్నే విమానం ఎక్కి అభినందనలు చెప్పి.. సాయంత్రం విమానంలో తిరిగొచ్చిన సెలబ్రిటీలు ఉన్నారని.. కౌంటింగ్ పూర్తికాకముందే శుభాకాంక్షలు చెప్పిన పెద్దలు కూడా ఉన్నారని.. వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినట్టు. వారి అభినందనలు జగన్ కి అవసరం లేదు కానీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళంగా మేం కోరుకుంటున్నాం.

ఇందులో భాగంగా ‘వాట్సాప్’ లో ఈ విధంగా స్టేటస్ లు కూడా పెట్టాడట. “సినిమా పెద్దలారా సీఎంను అభినందిచరా..? బొడ్డు మీద బొప్పాయిలు కొట్టి వయసు మళ్ళిన తరువాత భక్తిమార్గంలో ఎస్వీబీసీ భక్తిని పట్టిన దర్శకేంద్రుడికి ఇంకా జగన్ గెలుపు కనిపించలేదా..? నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడమే మహా ఉద్యమంగా భావించి పొద్దున్నే విమానంలో వెళ్లిన సురేష్ బాబుకు జగన్ గెలుపు కనిపించలేదా? నిర్మాతలకే నిర్మాత, నిర్మాతల తాతలకే తాత అయిన అల్లు అరవింద్ కు ఇంకా జగన్ గెలుపు వార్త ఎవరూ చెప్పినట్టు లేదు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంలో కలిపి ఊపిరిపీల్చుకున్న చిరంజీవి చెవిన జగన్ గెలుపు వార్త ఇంకా ఎవరూ వేయలేదేమో. ఇలా మీ పై విమర్శలు చేయడం వలన నాకు సినిమా అవకాశాలు తగ్గినా పర్వాలేదు. ఎప్పటినుండో మా సామాజిక వర్గాన్ని ఇండస్ట్రీ తొక్కుతూనే ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా తొక్కాలా” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus