స్పీడ్ తగ్గేది లేదంటున్న పూరి జగన్నాథ్!

  • September 13, 2017 / 08:30 AM IST

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కి ఈ మధ్య పెద్ద హిట్స్ ఏమి లేవు. తాజాగా బాలకృష్ణతో తెరకెక్కించిన పైసా వసూల్ కూడా నిరాశ పరిచింది. అయినప్పటికీ నిర్మాతలు పూరితో సినిమా తీయడానికి ఇష్టపడుతున్నారు. కారణం అనుకున్న సమయానికి సినిమాని కంప్లీట్ చేయడం, అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో చిత్రాన్ని పూర్తి చేయడం. అతనిలోని ఈ రెండు గుణాలు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. సో పూరి కూడా తగ్గడంలేదు. చకచకా స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, రవితేజలకు కథలు రెడీగా ఉన్నాయి.

వాటికీ స్టార్ హీరోస్ ఒకే చెబితే వారితో చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ హీరోస్ డేట్స్ ఇవ్వలేకపోతే అదే కథలతో ఇషాన్, ఆకాశ్ లతో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన సమయాన్ని మాత్రం వృధా చేయడానికి పూరి ఇష్టపడడం లేదు. ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ తో సినిమాని స్వీయదర్శకత్వంలో తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మూవీ నాలుగు నెలల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఇషాన్ తో మూవీ చేస్తారా, స్టార్ హీరో తో చేస్తారో ఇప్పుడే చెప్పలేము.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus