పాత కధనే….మళ్ళీ చెబుతున్నాడా??

  • October 12, 2016 / 09:58 AM IST

టాలీవుడ్ టాలెంట్ దర్శకుల్లో మన పూరీ జగన్నాధ్ ఒకరు…ఆయన తీసే ప్రతీ సినిమాలో కధ విషయం ఎలా ఉన్నా….స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూరీ మార్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది….అంతేకాదు….ఆయన డైలాగ్స్, స్క్రీన్ పై పాత్రల ప్రెసెన్స్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు పూరీ…ఎన్టీఆర్ తో దాదాపుగా 10ఏళ్ల గ్యాప్ తరువాత “టెంపర్” సినిమా చేసి భారీ హిట్ అందుకున్న పూరీ….వెనువెంటనే కల్యాణ్ రామ్ తో “ఇజమ్” సినిమాను చాలా భారీగా తెరకెక్కించాడు….

ఈమధ్యనే విడుదలయిన ఈ సినిమా టీజర్ మరియు పాటలు మంచి క్రేజ్ ను సంతరించుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇదిలా ఉంటే పూరీ జగన్నాధ్ రూటు మార్చడట…..ఇప్పటివరకూ తాను తీసిన కధలకే మళ్ళీ ప్రాణం పోస్తాను అంటున్నాడు…ఇంతకీ విషయం ఏమిటంటే….పూరీ కధలు రాసుకోవడంలో కూడా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి… రవి తేజతో ‘దేవుడు చేసిన మనుషులు” సినిమా తీసిన పూరీ…..ఆ కధ ఫెయిల్ కావడంతో..రూటు మార్చి ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో రూటు మార్చాడు… అయితే ఆది సక్సెస్ కావడంతో ఇజమ్ తో మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు…అయితే ఇలా మార్చుకుంటూ పోతే కష్టం అనుకున్నాడో ఏమో కానీ…మొత్తానికి అనవసరమైన కొత్త కథలకు పోకుండా.. గతంలో తాను తీసిన కథలకే ఇప్పుడు రెండో కథను రాసేందుకు రెడీ అవుతున్నాడట….అంటే ఆ కధలకు సీక్వేల్ అన్న మాట…ఈడియట్ – పోకిరి – బిజినెస్ మ్యాన్ – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్ మొదలగు సినిమాల కథల నిజంగానే చాలా కిక్కిస్తాయి.

వాటి కోసం ఇప్పుడు పూరి సీక్వెల్ కథలను రెడీ చేస్తున్నాడట. అంతేకాదండోయ్ ఒకవేళ మెగా ఫ్యామిలీలో ఎవరైనా చేస్తానంటే మాత్రం మనోడు బద్రి సీక్వెల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి కొత్త ప్రయత్నాలు ఎందుకు అనుకున్నాడో ఏమో…కానీ పాత కధలనే మళ్లీ రిపీట్ చేస్తున్నాడు మన దర్శకుడు…మరి ఈ ఫొర్ములా ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus