నందమూరి అన్నదమ్ముల సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్న పూరి

  • September 28, 2016 / 10:44 AM IST

అంతకుముందు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసినప్పటికీ ‘టెంపర్’తో ఆయనకు మరింత దగ్గరయ్యారు పూరి జగన్నాధ్. ఆ అనుబంధంతోనే ‘ఇజం’ ద్వారా కళ్యాణ్ రామ్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా దసరా రేసులో నిలిచినా పలు కారణాల వల్ల వెళ్ళింది. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ తెరమీకొచ్చింది. లైన్ విన్న ఎన్టీఆర్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ విన్నాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

వెంటనే పూరి తన ఫెవరెట్ స్పాట్ బ్యాంకాక్ లో వాలిపోయారు. చాలామందికి అది హాలిడే స్పాట్ కాగా పూరికి మాత్రం వర్కింగ్ స్పాట్. యధాప్రకారం పదిరోజుల్లో డైలాగ్ వర్క్ పూర్తి చేసిన పూరి హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ ని కలిసి ఏ విషయం తేల్చనున్నారు. దీంతోపాటు ‘ఇజం’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి ఇద్దరు నందమూరి సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ‘టెంపర్’ సినిమాతో కథల ఎంపికలో పరిణతి చెందిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలతో తన గ్రాఫ్ ని పెంచుకున్నాడు. అది కిందికి పడిపోకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus