అమితాబ్ బచ్చన్ తో పూరి మరో చిత్రం..?

  • May 10, 2016 / 11:11 AM IST

మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘బుడ్డా తేరా హోగా బాప్’ రూపొందించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూరిజగన్నాథ్ మరోసారి అమితాబ్ తో కలిసి పనిచేయనున్నారు. ఈసారి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లతో కలిసి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. దీనిపై బాలీవుడ్ వర్గాలు పూరిని సంప్రదించగా ‘ అవును. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఆఫీసు లో అమితాబ్ ను కలిశాను.

చాలాకాలం తరువాత  బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నాను. అమితాబ్, అభిషేక్ లతో కలిసి ఈసారి పనిచేయాలనుకుంటున్నాను. త్వరలోనే మంచి కథతో వారిని కలుస్తాన’ని తెలిపాడు. ఈ చిత్రం 2017 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న పూరి.. మే 25 నుంచి ప్రారంభం కానున్న కళ్యాణ్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus