మెహబూబా సినిమాని అఖిల్ కి ముందే చూపించనున్న పూరి

  • April 13, 2018 / 07:53 AM IST

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అతనితో మెహబూబా అనే సినిమాని తీస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అందమైన లవ్ స్టోరీ మే 11న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ట్రైలర్‌ని చూసిన అక్కినేని అఖిల్.. ‘‘వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్.. నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్‌లో మీరు చూపించిన విజువల్స్.. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతను పెంచేశాయి’’ అని ట్వీట్ చేశారు.

అఖిల్ ట్వీట్ చూసిన పూరి వెంటనే స్పందిస్తూ.. ‘‘ట్రైలర్ పట్ల నీ స్పందనకు నా ప్రేమాభివందనాలు. విడుదలకు ముందే మనం ‘మెహబూబా’ చూసేద్దాం” అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎస్.ఎస్. థమన్ స్వరాలూ కూర్చే పనిలో బిజీగా ఉండగా… అఖిల్, డైరక్టర్ తో కలిసి లొకేషన్స్ వేటలో ఉన్నారు. మరి అఖిల్ ఎప్పుడు మెహబూబా సినిమాని చూస్తారో ఇప్పుడే చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus