గుండెపోటుతో స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి!

  • January 29, 2021 / 11:55 AM IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. దీని తరువాత హైదరాబాద్, కేరళ ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తోన్న జి.శ్రీనివాస్(54) అనే వ్యక్తి సెట్స్ పైనే గుండెపోటుకి గురై మరణించారు. శుక్రవారం ఉదయం షూటింగ్ లొకేషన్ లో అస్వస్థతకు లోనయ్యారు శ్రీనివాస్.

గుండెనొప్పితో కుప్పకూలిపోవడంతో వెంటనే చిత్రయూనిట్ హాస్పిటల్ కి తరలించింది. హాస్పిటల్ కి వెళ్తోన్న దారిలోనే ఆయన కన్నుమూశారు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా శ్రీనివాస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నాయి. శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 13న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన మరుసటిరోజే ఇలా సెట్స్ లో క్రూ మెంబర్ మరణించడంతో చిత్రయూనిట్ విషాదంలో మునిగిపోయింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus