స్పెషల్ సాంగ్ కోసం రెమ్యునరేషన్ తీసుకోని హీరోయిన్!

  • September 16, 2017 / 11:31 AM IST

ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా నటించిన తాజా చిత్రం “జై లవకుశ” మరో ఐదురోజుల్లో థియేటర్లోకి రానుంది. ఓ వైపు హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకున్నప్పటికీ రవితేజ మూవీ  “రాజా ది గ్రేట్” చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఈ బ్యూటీ తొలిసారి ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడంతో దానిపై క్రేజ్ ఏర్పడింది. ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఎంత మొత్తం అందుకుందోనని గుసగుసలు మొదలయ్యాయి. ఇదే విషయాన్నీ ఓ రిపోర్టర్ ఆమె ముందు ఉంచగా.. దీనిపై రాశీ ఖన్నా క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్ కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని స్పష్టం చేసింది. “రాజా ది గ్రేట్” దర్శకుడు అనిల్ రావిపూడి తనకు మంచి స్నేహితుడని అతడి కోసమే రూపాయి కూడా తీసుకోకుండా ఆ సాంగ్ చేశానని వెల్లడించింది.

అనిల్ రావిపూడి డైరక్షన్లో  రాశీ ఖన్నా “సుప్రీమ్” చేసింది. అందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆఫర్లు సైతం వచ్చాయి. ఆ కృతజ్ఞతతో ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. రాశీ ఖన్నా చేసిన సాంగ్ రాజా ది గ్రేట్ చిత్రానికి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus