Radhe Shyam: అరుదైన ఘనత సాధించిన ప్రభాస్!

  • July 14, 2021 / 09:53 AM IST

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందనే సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తైతే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాధేశ్యామ్ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా మోషన్ మోస్టర్ కు యూట్యూబ్ లో ఏకంగా 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఇప్పటివరకు మరే మోషన్ పోస్టర్ ఈ స్థాయిలో వ్యూస్ ను సాధించలేదు. పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజైన తర్వాత ఇంకెన్ని రికార్డులను ఖాతాలో వేసుకుంటుందో చూడాల్సి ఉంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కు ఉన్న గుర్తింపు వల్లే అరుదైన రికార్డులు ప్రభాస్ సొంతమవుతున్నాయి. ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత నటిస్తున్న ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ కావడం గమనార్హం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని తెలుస్తోంది. జిల్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ సినిమాతో సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus