టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) తో బ్లాక్ బస్టర్ కొట్టి కమ్ బ్యాక్ ఇచ్చినా… తర్వాత వచ్చిన ‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి డిజాస్టర్లు ఆయనను మళ్ళీ రేసులో వెనక్కి నెట్టాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ ఓ హిట్టు కొట్టి తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి పూరీది. ‘లైగర్’ (Liger) తర్వాత పూరీ (Puri Jagannadh) దర్శకత్వంలోనే ‘JGM'(జన గణ మన) (Jana Gana Mana) అనే సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రెడీ అయ్యాడు.
కానీ ‘లైగర్’ (Liger) ఫలితం వల్ల.. ఆ ప్రాజెక్టు డిలే అయ్యింది. పైగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కి ‘లైగర్’ (Liger) విషయంలో ప్రామిస్ చేసిన పారితోషికం కూడా పూరీ ఎగ్గొట్టినట్టు ఓ టాక్ నడిచింది. అందువల్లే విజయ్.. పూరీని నమ్మలేదు అని అందుకే ‘JGM'(జన గణ మన) క్యాన్సిల్ అయ్యింది అనే వాదన కూడా ఉంది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మొత్తానికి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
నటీనటుల ఎంపిక కూడా ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో పాటు టబు, దునియా విజయ్ (Duniya Vijay) వంటి వారు ఈ ప్రాజెక్టులో భాగం అయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సంయుక్త మీనన్ (Samyuktha Menon) కూడా ఫైనల్ అయినట్టు అనౌన్స్ చేశారు. ఈమెనే లీడ్ రోల్ అనే ప్రచారం జరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాలో లీడ్ రోల్ గా రాధికా ఆప్టే (Radhika Apte) ని తీసుకున్నట్లు గతంలో టాక్ నడిచింది.
నిన్న ఈ సినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది అని మేకర్స్ చెప్పినప్పుడు అంతా రాధికా ఆప్టే (Radhika Apte) ని అధికారికంగా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా సంయుక్త మీనన్ గురించి చెప్పి షాకిచ్చారు. దీంతో రాధికా ఆప్టే (Radhika Apte) ప్లేస్ లోనే సంయుక్త (Samyuktha Menon) ని తీసుకుని ఉంటారు అని అంతా అనుకున్నారు. కానీ మరోపక్క.. ఈ సినిమాలో రాధికా ఆప్టే కూడా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. మరి నెక్స్ట్ అనౌన్స్మెంట్లో భాగంగా రాధికా పేరు రివీల్ చేస్తారా? లేక ఆ పాత్రని రిలీజ్ వరకు సర్ప్రైజింగ్ గా ఉంచుతారా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.