రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం రంగంలో దిగిన మార్చింగ్ యాంట్స్

  • March 17, 2018 / 09:15 AM IST

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. కోట్లు కుమ్మరించడానికి బాలీవుడ్ నిర్మాతలు క్యూ కట్టినా జక్కన్న తెలుగు సినిమాని తీయడానికే మొగ్గుచూపారు. అయినా బాలీవుడ్ కంపెనీలు రాజమౌళిని వదలడం లేదు. తాము మీ సినిమాకి పనిచేస్తామని ముందుకొస్తున్నాయి. రాజమౌళి తాను తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీ కోసం ముంబైకి చెందిన మార్చింగ్ యాంట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ సినిమాకు ప్రచారానికి సంబందించిన పనులను చేపట్టింది. ఇంకా పూజ కార్యక్రమాలు కూడా జరగని సినిమాకి ప్రచార కంపెనీతో పని ఏమిటి అనుకుంటున్నారా? ఈ కంపెనీ స్పెషల్ ఇది. పూజా కార్యక్రమాల నుంచే ప్రచారం మొదలు పెడతారు. మొదటి షో వేసే వరకు ఈ ప్రచారం సాగుతుంది.

వీళ్ళ ఫోటో షూట్ కోసమే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లారు. అక్కడ ప్రఖ్యాతచెందిన ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించారు. వాటికీ మళ్ళీ వర్క్ చేసి రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించిన రోజు ఈ స్టిల్స్ బయటికి రానున్నాయి. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ లోను పోస్టర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక హీరోయిన్స్ ఫిక్స్ అయిన వెంటనే వారు కూడా లాస్ ఏంజెల్స్ కి వెళ్లాల్సిందేనని టాక్. రాజమౌళి ప్రచారాన్ని ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తే.. సినిమాని ఇంకెంత ప్లాన్ చేశారో.. అంచనా వేయలేకపోతున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus