సంక్రాంతి రోజు మల్టీ స్టారర్ మూవీ ప్రకటించనున్న రాజమౌళి

  • January 4, 2018 / 07:19 AM IST

సినిమాలను గుప్పెట దాచి ఉంచడంలో దర్శకధీరుడు రాజమౌళికి మించిన వారు లేరు. సినిమా ప్రకటన నుంచి రిలీజ్ వరకు చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తుంటారు. బాహుబలి తర్వాత ఆయన చేసే సినిమా విషయంలో ఆ విధానాన్నే పాటిస్తున్నారు. కేవలం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఒక ఫోటోని పోస్ట్ చేసి బజ్ క్రియేట్ చేసారు. మెగా హీరో, నందమూరి హీరోలు నటిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించలేదు. ఆ హీరోలు కూడా నోరు మెదపలేదు. ఆ సస్పెన్స్ సంక్రాంతి రోజు వీడిపోనుంది. ఆ పండుగనాడు శుభవార్తను రాజమౌళి ప్రకటించనున్నారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఎక్కడా హర్ట్ కానీ విధంగా స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సమానంగా సీన్లు రాసి, ఇద్దరు సంతృప్తి చెందడంతో సినిమా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

ఇందులో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా నటించబోతున్నారా? లేదా? అనే విషయం కూడా అదే రోజు ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఈ రెండు పూర్తి అయిన తర్వాత మల్టీస్టారర్ పట్టాలెక్కనుంది. ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి డీవీవీ దానయ్య సిద్ధంగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus