Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Advertisement

‘మేమ్ ఫేమస్’ అనే యూత్‌ఫుల్ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. మొదటి సినిమాతోనే నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. దాదాపు 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘గోదారి గట్టుపైన’ అనే ఫ్యామిలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Raju Weds Rambai

మే 8న ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో సుమంత్ ప్రభాస్ పాల్గొన్నాడు.’మేమ్ ఫేమస్’ విజయం సాధించడంతో సుమంత్ ప్రభాస్ కి చాలా ఆఫర్లు వచ్చాయట.

కానీ తొందరపడకుండా.. మంచి కథ ఎంపిక చేసుకోవాలనే ప్రాసెస్ లో దాదాపు 50 కథలను అతను రిజెక్ట్ చేశాడట. ఇందులో హిట్ అయిన సినిమా కథలు ఉన్నాయట. అందులో ‘రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) ఒకటని అతను రివీల్ చేశాడు.దర్శకుడు సాయిలు మొదట ఈ కథని సుమంత్ ప్రభాస్ కే వినిపించాడట. కథ నచ్చినప్పటికీ… దీని నేపథ్యం కూడా ‘మేమ్ ఫేమస్’ లాగే తెలంగాణ గ్రామీణ వాతావరణంలో ఉందని భావించి వద్దనుకున్నాడట.

బ్యాక్-టు-బ్యాక్ ఒకే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉందని భావించిన సుమంత్, కొత్తదనం మాత్రమే ‘రాజు వెడ్స్ రాంబాయి’ వద్దనుకున్నట్టు తెలిపాడు. కానీ భవిష్యత్తులో సాయిలు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అని తెలిపాడు సుమంత్ ప్రభాస్. అందుకు సాయిలు రెడీగా ఉంటాడా లేదా అనేది ‘గోదారి గట్టుపైన’ సినిమా రిజల్ట్ ని బట్టి ఆధారపడి ఉండొచ్చు.

చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus