Ram Charan: ఈసారి మమ్ముట్టి సినిమాపై కన్నేసిన రామ్ చరణ్!

  • October 8, 2022 / 01:28 PM IST

ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెగా హీరోలు రీమేక్ చిత్రాలపై మక్కువ చూపుతున్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ భీమ్లా, నాయక్ సినిమాలో కూడా రీమేక్ చిత్రాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా విజయదశమి సందర్భంగా విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తదుపరి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా తమిళ వేదాలం సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ మధ్యకాలంలో మెగా హీరోలు ఎక్కువగా రీమేక్ చిత్రాలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ మరో మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మమ్ముట్టి నటించిన భీష్మ పర్వం సినిమా రీమేక్ హక్కులను రాంచరణ్ కొనుగోలు చేశారట.

ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఏడాది మార్చి నెలలో విడుదల అయ్యి అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రీమేక్ హక్కులను రాంచరణ్ కొనుగోలు చేశారు. ఇలా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా హక్కులను రాంచరణ్ ఎవరికోసం కొనుగోలు చేశారనే విషయంపై సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమాని కూడా తన తండ్రి చిరంజీవి కోసమే రామ్ చరణ్ కొనుగోలు చేశారా అనే సందేహం కలుగుతుంది.అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, ఈ సినిమాను రామ్ చరణ్ ఎవరికోసం కొనుగోలు చేశారనే విషయం తెలియాలంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus