పవన్ ని మించిన నాయకుడు లేడు : వర్మ

  • September 3, 2016 / 06:24 AM IST

విమర్శలనే గుప్పిస్తూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రశంసల బాటలోకి వచ్చారు. నెగటివ్ గా ఆలోచించడం మాని పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. తాజాగా అయన పోస్ట్ చేసిన కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. “ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని మించిన నాయకుడు లేడు. నిజాయితీ అతని పవర్ అయితే, నిబద్ధత అతని స్టార్” అని శుక్రవారం ట్వీట్ చేసాడు.

పవన్ రాజకీయాల్లోకి వెళ్లాలని వర్మ గతంలో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత స్పందించలేదు. మళ్ళీ ఇన్నాళ్లకి పవన్ గురించి మాట్లాడారు. తిరుపతి సభలో జనసేన అధ్యక్షుడి ప్రసంగానికి అయన ఫిదా అయినట్లు వెల్లడించారు. “పవన్ స్పీచ్ ని మొత్తం విన్నాను. మూడు దశల్లో ఫైట్ చేయాలని చెప్పిన మాట నిజమనిపించింది.” అని మరో ట్వీట్ లో వర్మ వివరించారు. దీంతో పవన్ అభిమానులు వర్మకు కృతజ్ఞతలు చెప్పారు. కాకినాడలో ఈనెల 9 న జరగనున్న సభలో పవర్ స్టార్ మాటలను వినేందుకు ఫ్యాన్స్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus