నేనే రాజు నేనే మంత్రి అంటున్న రానా!

  • January 4, 2017 / 06:57 AM IST

బాహుబలి లో విలన్ గా అలరించిన రానా మళ్లీ హీరోగా చిత్రాలు చేస్తున్నారు. బాహుబలి చిత్రీకరణ గ్యాప్ లోనే ‘ఘాజీ’ సినిమా షూటింగును పూర్తిచేసారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 1971 వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ద కథాంశంతో డైరక్టర్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన మూవీ రిలీజ్ కాకముందే రానా మరో సినిమాను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రాల డైరక్టర్ తేజ  దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నిన్న(మంగళవారం) అనంతపురంలో ప్రారంభమయింది. మొదటి రోజు షూటింగ్ విశేషాలను రానా నేడు ట్విట్టర్లో వెల్లడించారు.

ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకొస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రానా పొలిటికల్ కథతో తొలి చిత్రం లీడర్ మూవీ చేశారు. తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇలా హీరో హీరోయిన్ కి ఈ చిత్రం స్పెషల్. రానా మరో మారు నాయకుడిగా నటించడం, కాజల్ తేజ డైరక్షన్లో రెండో సారి నటిస్తుండడంతో ఈ మూవీపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus