రణబీర్ ఆరోగ్యంపై తల్లి పోస్ట్!

  • March 9, 2021 / 03:23 PM IST

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ.. మరోపక్క వైరస్ విజృంభిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త స్ట్రెయిన్ కేసులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి సిటీల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కేర్ తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదొక విధంగా కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై రణబీర్ తల్లి, నటి నీతూకపూర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన కుమారుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పిన ఆమె ప్రస్తుతం రణబీర్ కోలుకుంటున్నాడని.. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. గత నెలతో పోలిస్తే ముంబైలో కోవిడ్ కేసుల సంఖ్య 89 శాతం పెరిగింది. దీంతో మహారాష్ట్రలో థానేలో మార్చి13 నుండి 31 వరకు పదకొండు హాట్‌స్పాట్లలో లాక్ డౌన్ ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. రణబీర్, అలియా కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషించారు.


Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus