రషెస్ చూసి రీషూట్ చేయమని కోరిన శర్వానంద్

  • November 10, 2018 / 11:52 AM IST

సినిమా అన్నాక విడుదల ముందు వరకూ చిన్న చిన్న మార్పులుచేర్పులు జరుగుతూనే ఉంటాయి. రీషూట్స్ కూడా అందులో భాగమే. ప్రతి సినిమాకి ఎవరో ఒకరు సూచించిన మార్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు శర్వానంద్ తాజా చిత్రం పరిస్థితి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అయితే.. ఇక్కడ చిన్న తేడా ఉంది. అసలు మేటర్ ఏంటంటే.. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం మొదలైన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకూ కేవలం 70% మాత్రమే పూర్తయ్యింది.

మధ్యలో శర్వా “పడి పడి లేచే మనసు” షూటింగ్ లో బిజీ అయిపోవడంతోపాటు సుధీర్ వర్మ స్క్రిప్ట్ పరంగా చేసిన కొన్ని మార్పుల కారణంగా ఆ సినిమా షూటింగ్ చాలా లేట్ గా జరుగుతూ వస్తోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఇటీవల సుధీర్ వర్మ తీసిన రషెస్ చూసిన శర్వానంద్ అర్జెంట్ గా రీషూట్ చేయమని చెప్పడంతోపాటు స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ కూడా చెప్పాడట. అలా చెప్పడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ.. రీషూట్ మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ రీషూట్ తర్వాత అవుట్ పుట్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus