పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయించిన రేణూ…కారణం ఈ ఫోటోనే..!

  • December 2, 2020 / 05:40 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … రేణూ దేశాయ్ లు విడిపోయి 8 ఏళ్ళు కావస్తున్నప్పటికీ …. పిల్లలు ఆద్య, అఖీరా ల గురించి కలుస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ…. పిల్లలకు సంబంధించి ప్రాముఖ్యమైన విషయాల కోసం ఆయన కొంత సమయాన్ని కేటాయిస్తూనే వస్తున్నారు. అదే విషయాన్ని రేణూ దేశాయ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది రేణూ.

అయితే పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా విషయం పై అభిమానులు ప్రశ్నలు వేస్తే వాటికి దాటేస్తూ వస్తుంటుంది రేణూ. అయితే తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా.. పవన్ కళ్యాణ్ రేర్ ఫోటోని షేర్ చేసింది రేణూ దేశాయ్. ఈ ఫొటోలో పవన్ … తన ఇద్దరి పిల్లలు అయిన ఆద్య, అకీరా లతో సంతోషంగా గడుపుతున్నారు. ‘నేను కొన్ని అరుదైన ఫోటోలను నా ఫోన్‌లో ఉన్న కెమెరాతో క్లిక్ అనిపిస్తూ ఉంటాను.

ఈ ఫోటో కూడా ఆ లిస్ట్ లోనిదే ‘ అంటూ చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. ఈ ఫోటో చూసిన పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రేణూ దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుందట.దాంతో పాటు హోస్ట్ గా కూడా కొన్ని టాక్ షోలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus