‘కొండా’ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో వంచనగిరి అమ్మ వారికి మందు తాగించిన రామ్ గోపాల్ వర్మ

  • October 12, 2021 / 05:56 PM IST

నిత్యం వివాదాలతో బంతాట ఆడుకోవడం దర్శకుడు రాంగోపాల్ వర్మకి బాగా అలవాటు. నలుగురికి నచ్చింది ఈయనకి  నచ్చదు. ఈయనకి నచ్చింది ఏ ఒక్కరికీ నచ్చదు.నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే వర్మ..అవే వార్తలను ఆధారం చేసుకుని సినిమాలు కూడా తీసేస్తూ ఉంటారు. వాస్తవిక సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.ఈయన టేకింగ్ కు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు అంటే అదే ప్రధాన కారణం. గతంలో ఎంతో మంది ప్రముఖుల జీవితాలను ఆధారం చేసుకుని సినిమాలు చేసిన వర్మ…వాటి ప్రమోషన్లను కూడా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి కొన్ని రోజులు హాట్ టాపిక్ అయ్యారు.

దాంతో ఎంతో మంది ఈయన పై దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వర్మ తగ్గింది లేదు.ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘కొండా’ దంపతుల జీవితాలను తెర పై ఆవిష్కరించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం వరంగల్లోనే జరపనున్నట్టు కూడా వర్మ ప్రకటించారు.దీంతో ‘కొండా’ సినిమా తెలంగాణలో కొత్త రచ్చ చేయడం గ్యారెంటీ అని అంతా అనుకుంటున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ప్రారంభోత్సవం రోజు నాడే ఓ వింత పని చేసి హాట్ టాపిక్ అయ్యాడు వర్మ.

ఈరోజు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ చిత్రం ఘనంగా ప్రారంభం అయ్యింది. వరంగల్ లోని వంచనగిరి ఊరులో ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఎవ్వరూ ఊహించని ఓ వింత పని చేసి మళ్ళీ హాట్ టాపిక్ అయ్యారు దర్శకులు వర్మ. అదేంటంటే… ఈ వేడుకలో వంచనగిరి కోట గండి మైసమ్మ అమ్మ వారికి మందు తాగించారు. తద్వారా అమ్మ వారి దీవెనలు అందుకున్నారు. వర్మ చేసిన పనికి అక్కడున్న వారంతా విస్తురపోయారు. అయితే ప్రారంభోత్సవం రోజునాడే వర్మ చేసిన పని వల్ల సినిమా పై జనల దృష్టి పడింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus