Guppedantha Manasu September 13th: డిబిఎస్డి కాలేజ్ ని సొంతం చేసుకోబోతున్న సౌజన్య రావు!

  • September 13, 2023 / 12:26 PM IST

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. రిషి ఏంజెల్ తో పెళ్లికి ఒప్పుకుంటారా లేక వసుధారని తనకు కాబోయే భార్య అంటూ పరిచయం చేస్తారా అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి ఏంజెల్ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలని పంతులను విశ్వనాథం పిలిపిస్తారు. అయితే రిషి మాత్రం పంతులకి డబ్బులు ఇచ్చి తనని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతారు. దాంతో విశ్వనాథం ఎందుకు అలా చేస్తున్నారు అంటూ అడగగా అన్ని విషయాలు చెబుతానని రిషి చెబుతారు.

ఇక ఈ పెళ్లి నేను చేసుకోవడం లేదు అని చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు నువ్వే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నది అంటూ విశ్వనాథ మాట్లాడడంతో నేను ఒప్పుకున్నట్టు మీరు బ్రమపడ్డారు అంతేగాని నేను ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు అంటూ రిషి మాట్లాడతారు. ఏంజెల్ రిషితో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ రిషి నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే కదా మేము ఏర్పాట్లు అన్నీ చేసాము. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ కారణాలు చెప్పమని అడుగుతుంది ఇలా ఎంతగా బ్రతిమలాడినా రిషి మాత్రం కారణం చెప్పడు నేను విశ్వం నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నామని నీకు లోకువ అయ్యామా అంటూ ఏంజెల్ తనపై సీరియస్ అవుతుంది

అయినప్పటికీ రిషి చెప్పకపోవడంతో నువ్వు ఇప్పుడు చెప్పకపోతే మన స్నేహం మీద ఒట్టే అంటూ ఏంజెల్ మాట్లాడటంతో తప్పనిసరి పరిస్థితులలో నోరు విప్పుతారు. అయితే జగతి మహీంద్ర తన తల్లిదండ్రులని తాను వసుధారను పెళ్లి చేసుకోబోతున్నానని మాత్రం నిజం చెప్పడు. తనకు ఇదివరకే వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది అంటూ రిషి చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు మరోవైపు జగతి వసుధార ఎంతో సంతోషపడతారు. ఏం మాట్లాడుతున్నావ్ రిషి అంటూ ఏంజెల్ అనడంతో అవును నాకు ఇదివరకే వివాహం జరిగింది. నా భార్య ఇంకా బ్రతికే ఉంది అందుకే నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంటూ రిషి చెప్పడంతో నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెబుతున్నావు కదా అంటూ ఏంజెల్ నిలదీస్తుంది.

మరి మూడు సంవత్సరాలుగా నీ భార్యకు ఎందుకు దూరంగా ఉన్నావు? అసలు తన ఎవరు ఎక్కడుంది అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తుంది. దీంతో రిషి సీరియస్ అవుతారు. ఇక ఏంజెల్ వసుధారని అడుగుతూ నీకు తెలుసా రిషి భార్య ఎవరో అని అడగగా వసుధార ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారుపడుతుంది అయినా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్న నాకే తెలియదు మొన్న వచ్చిన నీకేం తెలుస్తుంది అంటూ తిరిగి మహేంద్ర వాళ్ళను అడుగుతుంది. మరోవైపు డిబిఎస్టి కాలేజీ తన సొంతం చేసుకోవడానికి సౌజన్య రావు అన్ని పథకాలు వేస్తుంటారు. కోటి రూపాయలు సాయంత్రం 6 గంటలకు నాకు చెల్లించకపోతే ఈ కాలేజ్ నా సొంతమవుతుంది అని మాట్లాడటంతో పనింద్ర సీరియస్ అవుతారు.

కోటి రూపాయల కోసం కోట్ల విలువ చేసే ఈ కాలేజ్ ని తాను వదులుకోనని ఫణీంద్ర చెబుతారు. కోటి రూపాయలు అని తక్కువ అంచనా వేయకు నీ కాలేజీ పరువు నీ ఇంటి పరువు కాపాడినది ఆ కోటి రూపాయలు సాయంత్రం లోపు నువ్వు ఆ కోటి రూపాయలు ఇస్తే సరి లేదంటే ఈ కాలేజ్ నా సొంతమవుతుందని సౌజన్య రావు కండిషన్ పెట్టడంతో ఫణీంద్ర ఈ కాలేజ్ బాధ్యతలన్ని జగతి చూసుకుంటుంది ఇప్పుడు జగతి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది తనని వెంటనే రమ్మని ఫోన్ చేస్తానని చెప్పగా అంతలోపు దేవయాని అక్కడికి వచ్చి తన మాటలతో అందరిని మాయ చేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus